విజయ్ దేవరకొండ నటించిన మాస్ ఎంటర్టైనర్ లైగర్ (Liger). బాక్సాఫీస్ వద్ద అభిమానులు, మూవీ లవర్స్ అంచనాలను అందుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి సీనియర్ నటి ఛార్మి (Charmee Kaur) వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మార్కెట్లో మంచి బిజినెస్ చేస్తుందని ధీమాగా ఉన్న దర్శకనిర్మాతలకు తీవ్ర నిరాశనే మిగిల్చింది లైగర్.
బాక్సాఫీస్ వద్ద ఆకట్టకోకపోవడంతో ఛార్మీ కూడా నష్టాలు మూటగట్టుకునే పరిస్థితులేర్పడ్డాయని ఇప్పటికే కొన్ని కథనాలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఛార్మీ సోషల్ మీడియా (social media) నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. కొంతకాలం సోషల్మీడియాకు దూరంగా ఉంటానని ట్వీట్ చేసింది ఛార్మీ. అంతేకాదు పూరీ కనెక్ట్స్ మళ్లీ పుంజుకొని పున్వరైభవం తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఛిల్ గాయ్స్..కేవలం సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా..పూరీ కనెక్ట్స్ ఫుల్ ఎనర్జీతో మళ్లీ గొప్పగా తిరిగొస్తుంది..అని ట్వీట్లో పేర్కొన్నది ఛార్మీ. లైగర్ చిత్రంలో బాలీవుడ్ నటి అనన్యపాండే హీరోయిన్గా నటించింది. లెజెండరీ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ను బరిలోకి దింపినా లైగర్కు అంతగా కలిసి రాలేదు. ఈ నెల చివరికల్లా లైగర్ డిస్నీ+హాట్ స్ట్రార్లో ప్రీమియర్ అయ్యే అవకాశాలున్నాయి.
Chill guys!
Just taking a break
( from social media )@PuriConnects will bounce back 😊
Bigger and Better…
until then,
Live and let Live ❤️— Charmme Kaur (@Charmmeofficial) September 4, 2022