BellBottom |ఒకప్పుడు బాలీవుడ్లో ఒక సినిమా విడుదలైంది అంటే.. తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉండేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొన్ని నెలలుగా థియేటర్ల మోహమే చూడడం మానేశారు ఆడియన్స్. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా సునామీ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు బయటకు రావడం మానేశారు. హాయిగా ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో వచ్చే సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలను థియేటర్లలో కంటే కూడా డిజిటల్ మీడియాలో విడుదల చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఆగస్టు 19న ఈ సినిమా దాదాపు 800 థియేటర్లలో విడుదలైంది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్లో విడుదలైన పెద్ద సినిమా ఇదే. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. మరోసారి అక్షయ్ కుమార్ తన నట విశ్వరూపం చూపించాడు అంటూ సినీ పండితులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దాంతో కచ్చితంగా కలెక్షన్స్ కూడా బాగానే వస్తాయి అని అందరూ ఊహించారు. పైగా దీనికి వచ్చే కలెక్షన్స్ చూసిన తర్వాత మిగిలిన సినిమాలు థియేటర్లలో విడుదల చేయాలా లేదా అనే నిర్ణయం తీసుకుందామని అనుకున్నారు నిర్మాతలు.
ఒకప్పుడు అక్షయ్ కుమార్ సినిమా వచ్చిందంటే తొలి రోజు కలెక్షన్స్ దాదాపు రూ.30 కోట్లు ఉండేది. కానీ ఇప్పుడు బెల్ బాటమ్ సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్లు కేవలం రూ.2 కోట్లు మాత్రమే. మళ్లీ అందులో రూ.50 లక్షలకు పైగా షేర్ తెలుగు రాష్ట్రాల నుంచి రావడం గమనార్హం. అంటే ఉత్తరాది నుంచి కేవలం కోటిన్నర మాత్రమే కలెక్షన్ వచ్చింది. అందుకే కష్టమో నష్టమో ఓటీటీలోనే తమ సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ లెక్కన ఇప్పట్లో పెద్ద సినిమాలు థియేటర్లలో చూడటం చాలా కష్టం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గుండెపోటుతో కేరళకు చెందిన ప్రముఖ నటి మృతి..!
OTT | మెల్లిమెల్లిగా ఓటీటీలు టాలీవుడ్ను కమ్మేస్తున్నాయా?
మెగా డాటర్ డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
సినిమాలని వదిలేసి బిజినెస్ చేసే ఆలోచనలో మంచు మనోజ్..!
సెక్స్ రాకెట్ నడుపుతున్న మోడల్ని అరెస్ట్ చేసిన పోలీసులు