కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు,మంచు మనోజ్ పరిశ్రమలో పెద్దగా రాణించలేకపోయారు. మంచు విష్ణు అప్పుడప్పుడు ఒక సినిమా చేస్తూ మరోవైపు విద్యానికేతన్ స్కూలు వ్యవహారాలు చూసుకుంటున్నాడు.మనోజ్ విషయానికి వస్తే కొన్నాళ్లుగా సినిమాలలో నటించడమే మానేశాడు.
బాల నటుడిగా ఇండస్ట్రీకి అడుగు పెట్టిన మనోజ్ దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అలా వరుసగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో పర్సనల్ లైఫ్ డిస్ట్రబ్ వలన సినిమాలకు కూడా కొంచెం దూరంగా ఉన్నాడు.
గతంలో తన సొంత బ్యానర్ లో అహం బ్రహ్మాస్మి అనే సినిమాను కూడా ప్రారంభించగా.. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్ ను కూడా విడుదల చేశారు. కానీ మళ్లీ ఈ సినిమా గురించి మళ్లీ ఎటువంటి అధికారిక ప్రకటన కూడా ఇంతవరకు రాలేదు. అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అని అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యంలో మనోజ్ సినిమాలు వదిలేసి బిజినెస్ చేస్తాడంటూ ప్రచారం నడుస్తుంది.
తిరుమల శ్రీవారిని నేడు మంచు మనోజ్, మంచు లక్ష్మి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర తెలంగాణలో వెంచర్స్ లను ప్రారంభించి, వీలైనంత మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నాడట.చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. అంటే రానున్న రోజులలో మనోజ్ సినిమాలు వదిలేసి బిజినెస్కే పరిమితం అవుతాడా..!