Jacqueline Fernandez | బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా సుఖేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటి నంచి ఈమె పేరు సోషల్మీడియాలో మార్మోగిపోతున్నది. ఈ కేసులో ఇప్పటికే ఈమె ఈడీ ఎదుట విచారణకు హాజరైంది. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్తో జాక్వెలిన్ దిగిన కొన్ని పర్సనల్ ఫొటోలు లీకయ్యాయి. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఈ ఫొటోలపై జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పందించింది. సుఖేశ్ చంద్రశేఖర్తో ఉన్న ఫొటోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు పెట్టింది.
ఈ దేశం, ఈ ప్రజలు ఎప్పుడూ నాకు విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని ఇచ్చారు. మీడియా మిత్రుల నుంచి నేను ఎంతగానో నేర్చుకున్నా. ప్రస్తుతం నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. ఈ విషయాన్ని నా స్నేహితులు, ఫ్యాన్స్ గమనిస్తున్నారనే అనుకుంటున్నా. అందుకే మీ అందర్నీ విజ్ఞప్తి చేస్తున్నా. నా గోప్యత, వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే ఫొటోలను ప్రసారం చేయవద్దని అభ్యర్థిస్తున్నారు. మీ ప్రియమైన వారి ఫొటోలను ఎలాగైతే ఇతరులకు షేర్ చేయరో.. అలాగే నా పర్సనల్ ఫొటోలను కూడా ప్రసారం చేయరని ఆశిస్తున్నా. అలాగే న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మోసగాడిని కాదు.. జాక్వెలిన్తో రిలేషన్షిప్లో ఉన్నా: సుకేష్ చంద్రశేఖర్