రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా ఆదివారం సైతం పకడ్బందీగా కొనసాగింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే వ్యాపారులు దుకాణాలను తెరిచి ఉంచారు. ప్రజలు లాక్డౌన్ సమయంలో మార్కెట్లకు తరలివచ్చి నిత్యావసర సరుకులను కొనుగోలు చేశారు. వివిధ మండలాలు, గ్రామాల్లోని ప్రధానకూడళ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి, మాస్కులు ధరించని వారికి పోలీసులు జరిమానా విధించారు.
బాన్సువాడ డివిజన్కేంద్రంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఆదివారం ఉదయం 10 గంటల అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డీఎస్పీ జయపాల్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. అనవసరంగా బయటికి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు. బాన్సువాడ డివిజన్లో ఇప్పటివరకు సుమారు 300 వాహనాలను సీజ్ చేశామని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఆయన వెంట పట్టణ ఎస్హెచ్వో రామకృష్ణారెడ్డి, రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్సై బషీర్, సిబ్బంది ఉన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. లాక్డౌన్ సడలింపు సమయం ముగిసిన తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
బీబీపేట్ మండలకేంద్రంలో తహసీల్దార్ నర్సింహులు, ఎస్సై మహేందర్ లాక్డౌన్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో బయటతిరగవద్దని, సరైనా కారణం లేకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వారి వెంట ఆర్ఐ అంజయ్య, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
గాంధారి మండలకేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగుతున్నది. పోలీసు, రెవెన్యూ అధికారులు లాక్డౌన్ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. మండలంలో ఉదయం 10 గంటల తర్వాత అన్ని దుకాణాలు, హోటళ్లను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. లాక్డౌన్ సడలింపు సమయం ముగిసిన తర్వాత రోడ్లపైకి వచ్చిన పలువురి వాహనాలను ఎస్సై శంకర్ సీజ్ చేశారు.
దోమకొండ మండలకేంద్రంలో ఆదివారం కొనసాగిన లాక్డౌన్ను ఏఎస్సై లింబాద్రి పర్యవేక్షించారు. ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలను మూసివేయాలని వ్యాపారులకు సూచించారు. ఉదయం 10 గంటల అనంతరం ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.లింగంపేటలో లాక్డౌన్ సడలింపు సమయంలో వ్యాపారులు దుకాణాలను తెరిచి ఉంచారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రజలు బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ బోసిపోయాయి.
మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండా గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ వద్ద ఎస్సై శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. లాక్డౌన్ సడలింపు సమయం తర్వాత రోడ్లపైకి వచ్చిన పది మంది వాహనదారులకు వెయ్యి రూపాయల చొప్పున ఈ-చలాన్ ద్వారా జరిమానా విధించినట్లు ఎస్సై వెల్లడించారు.పిట్లం మండలకేంద్రంలో ఎస్సై రంజిత్ ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగింది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు జరిమానా విధించారు.
నాగిరెడ్డిపేట్ మండలంలో లాక్డౌన్ కొనసాగింది. మండలకేంద్రంలో అన్ని దుకాణాలను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచారు. ఉదయం 10 గంటల తర్వాత జన సంచారం లేకపోవడంతో మండల కేంద్రం బోసిపోయింది.కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు సహకరించాలని బీర్కూర్ ఏఎస్సై రాములు అన్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను నిలిపివేసి జరిమానా విధించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సిబ్బంది సాయిలు, గంగాధర్ తదితరులు ఉన్నారు.
బిచ్కుంద మండలకేంద్రంలో ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగింది. లాక్డౌన్ సమయం ముగిసిన తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
తాడ్వాయి మండలంలో ఎస్సై కృష్ణమూర్తి సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. మండల పరిధిలోని కృష్ణాజివాడి, దేవాయిపల్లి గ్రామాల్లో లాక్డౌన్ను పర్యవేక్షించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 20 బైక్లను సీజ్ చేశామని, 30 షాపులకు జరిమానా విధించామని తెలిపారు.కామారెడ్డి పట్టణంలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగింది. వ్యాపారులు ఉదయం 10 గంటలకు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. పలువురు వ్యాపారులు స్వచ్ఛంద బంద్ నిర్వహించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు జరిమానా విధించారు.