Akhanda in OTT | నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం అఖండ. డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. కరోనాతో కష్టాల్లోకి వెళ్లిన థియేటర్స్కు జనాలు వస్తారా? రారా? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ బాక్సాఫీసు వద్ద గర్జించింది. ఈ సినిమా రిలీజై ఇప్పటికి నెల దాటింది. కానీ ఇంతవరకు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాలేదు. దీని తర్వాత రిలీజైన పుష్ప మాత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. జనవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో పుష్ప సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో అఖండ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డిస్నీ హాట్స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది.
నిజానికి అఖండ రిలీజ్కు ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జనవరి 2-3వ తేదీల్లోనే ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాత కూడా మంచి షేర్ తీసుకొస్తుంది. కలెక్షన్లు వస్తుండటంతో దర్శక నిర్మాతలు డిస్నీ హాట్స్టార్ నిర్వాహకులతో మాట్లాడి.. ఓటీటీ స్ట్రీమింగ్ను వాయిదా వేయించారు. దీంతో అఖండ ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ప్రేక్షకులకు ఎదురుచూపు తప్పలేదు. ఇదిలా ఉండగానే.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఓటీటీలోకి రావడం కన్ఫర్మ్ అయిపోయింది. అఖండ సినిమా తర్వాత వచ్చిన పుష్ప.. జనవరి 7 నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయం తెలిసిన నందమూరి ఫ్యాన్ ఒకరు.. మా బాలయ్య సినిమాను ఎప్పుడు ఓటీటీలోకి తీసుకొస్తారని ట్విట్టర్ వేదికగా డిస్నీ హాట్స్టార్ నిర్వాహకులను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన హాట్స్టార్ నిర్వాహకులు.. అఖండ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై క్లారిటీ ఇచ్చారు. జనవరి 21 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. ఈ విషయం తెలిసిన నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood | ఆ విషయంలో బాలీవుడ్ను వెనక్కి నెట్టేసిన టాలీవుడ్..
Aacharya | ఆ విషయంలో చిరంజీవి, బాలకృష్ణను ఇప్పటి హీరోలు అందుకోగలరా..?
Nivetha Thomas | జై బాలయ్య పాటకు స్టెప్పులేసిన నివేదా థామస్
నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే చంపుతా.. ఆ దర్శకుడికి బాలయ్య వార్నింగ్..