కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమా వస్తుందంటే చాలా తమిళ ప్రేక్షకులకు పండగే పండగ. సినిమా ప్రకటించినప్పటి నుంచి విడుదల వరకు అప్ డేట్స్ కోసం చాలా ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తుంటారు అజిత్ అభిమానులు. ఈ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం వలిమై. ఈ మూవీ ఫీవర్ యూరోపియన్ ఫుట్ బాల్ మ్యాచ్ టోర్నమెంట్ 2020కు చేరింది. స్టేడియంలోని గ్యాలరీలో ఉన్న ఓ అభిమాని వలిమై అప్ డేట్ ఏంటీ ? అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు.
ఇది గమనించిన ఫొటోగ్రాఫర్ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. వెంబ్లే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఈ దృశ్యం కనిపించింది. మరోవైపు ఫ్యాన్స్ కూడా వలిమై అప్ డేట్స్ ఎప్పుడంటూ అజిత్ ను అడుగుతూనే ఉన్నారు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న వలిమై చిత్రాన్ని హెచ్ వినోథ్ తెరకెక్కిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
చీరలో ఆదాశర్మ మార్షల్ ఆర్ట్స్..వీడియో వైరల్