మీకు గుర్తుందా? ఖాళీగా ఉన్న ఇండిగో విమానంలో ఓ యువతి మనికే మగే హితే అనే పాటకు డ్యాన్స్ వేసి సోషల్ మీడియాలో అదరగొట్టింది. తన పేరు ఆయత్. ఇండిగో ఎయిర్ హోస్టెస్. అప్పట్లో ఆ పాటకు ఫుల్ క్రేజ్ వచ్చింది. తను ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
తాజాగా.. ఆయత్ మరో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ప్రస్తుతం ఇన్స్టాలో జుగ్ను చాలెంజ్ నడుస్తోంది కదా. ఇండియన్ రాపర్ బాద్షా పాడిన జుగ్ను పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. జుగ్ను చాలెంజ్ను బాద్షా.. ముందు యూట్యూబ్లో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అది ఇన్స్టాకు కూడా పాకింది.
ఆ పాటకు డ్యాన్స్ వేసి ఆయత్ మరోసారి అదరగొట్టేసింది. అబ్బ.. ఏం డ్యాన్స్ వేశావు.. అంటూ నెటిజన్లు తనకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ వీడియోను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
7 వారాలు కరోనా వచ్చి కోమాలోకి వెళ్లింది.. ఆ తర్వాత కళ్లు తెరిచి చూసి షాక్ అయింది.. ఎందుకంటే?
తమ పెళ్లిని వెరైటీగా చేసుకోవాలనుకొని అడ్డంగా బుక్ అయిన జంట.. వైరల్ వీడియో