టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) త్వరలోనే ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం ఈ నెల రెండో వారంలో చిత్రీకరణ మొదలు కానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో హీరో తరుణ్ కీ రోల్లో కనిపించబోతున్నాడంటూ వార్తలు తెరపైకి వస్తున్నాయి.
ఈ వార్తలపై తరుణ్ (Tarun) స్పందించాడు. మహేశ్ బాబు సినిమాలో పాత్ర కోసం తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అంతేకాదు తాను ఏదైనా సినిమాకు సంతకం చేస్తే అభిమానులు, ఫాలోవర్లతో షేర్ చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. చాలా కాలంగా సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉంటున్న తరుణ్ మరి నెక్ట్స్ ఎలాంటి సినిమాతో ట్రాక్పైకి వస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత చినబాబు (ఎస్.రాధాకృష్ణ) ఎస్ఎస్ఎంబీ 28 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరిన్ని వివరాలపై టీం నుంచి త్వరలోనే క్లారిటీ రానుంది.
Read Also : Chiranjeevi | లో క్లాస్ టికెట్స్ లైన్లో నాగబాబుకు ఊపిరాడలేదు : చిరంజీవి
Read Also : 67th Filmfare Awards | ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్..ఉత్తమ నటిగా కృతిసనన్
Read Also : Irfan Pathan | మాజీ క్రికెటర్కు పవన్ కల్యాణ్ స్టైల్ అంటే ఇష్టమట..!
Read Also : Tollywood Ganesh idols | మార్కెట్లో టాలీవుడ్ స్పెషల్ గణేశుల సందడి