జాతిరత్నాలు ఫేం డైరెక్టర్ అనుదీప్ కేవీ కథనందిస్తున్న చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో (First Day First Show). వంశీధర్ గౌడ్-లక్ష్మి నారాయణ పుత్తంశెట్టి (Vamshidhar Goud) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. సంచితా బసు ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈవెంట్కు చీఫ్ గెస్ట్ గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాన్ని పంచుకోవాలని అడిగింది యాంకర్ సుమ. దీనికి చిరంజీవి స్పందిస్తూ..నేను ఇదివరకెప్పుడూ ఇది బయటకు చెప్పలేదు..ఇవాళ చెబుతున్నా. ఏవీఎం నిర్మాణంలో లెజెండరీ నటులు నందమూరి తారకరామారావు నటించిన రాము సినిమా…మా బంధువు పూర్ణ నన్ను, నాగబాబును ఈ సినిమాకు తీసుకెళ్లారని గుర్తు చేసుకున్నారు. లో క్లాస్ టిక్కెట్స్ కొనేందుకు లైన్లో ఉన్నపుడు నాగబాబుకు ఊపిరాడలేదన్నాడు.
నాన్న అంతకుముందు ఈ సినిమా షో చూసి బయటకు వస్తూ మమ్మల్ని చూశారు. థియేటర్ దగ్గర స్తంభానికి కట్టిన కొబ్బరి మట్ట పీకారు. అప్పుడు ఎందుకొచ్చావ్ అని నన్ను అడిగారు. నాన్న మీరు సినిమాకె వెళ్లారని తెలిసి మేమూ వచ్చామన్నా. అయితే నేలలోనా..వాడు చచ్చిపోతే..అంటూ నాన్న ఆ కొబ్బరిమట్టతో నన్ను చితక్కొట్టారంటూ చెప్పుకొచ్చారు చిరు. ఈ మాటలతో స్టేజీపై, కింద ఉన్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
Read Also : 67th Filmfare Awards | ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్..ఉత్తమ నటిగా కృతిసనన్
Read Also : Irfan Pathan | మాజీ క్రికెటర్కు పవన్ కల్యాణ్ స్టైల్ అంటే ఇష్టమట..!
Read Also : Tollywood Ganesh idols | మార్కెట్లో టాలీవుడ్ స్పెషల్ గణేశుల సందడి