టాలీవుడ్ (Tollywood) డ్రగ్స్ (Tollywood Drugs Case) కేసులో 12 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపిన ఈడీ ఒక్కొక్కరిగా విచారిస్తున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఇవాళ టాలీవుడ్ యాక్టర్ రానా (Rana) ఈడీ (Enforcement Directorate) ఎదుట హాజరయ్యాడు. రానా విచారణ ముగిసింది. సుమారు 7 గంటలపాటు రానా విచారణ కొనసాగింది. రానాతోపాటు అతని ఆడిటర్ సతీశ్ ను కూడా ప్రశ్నించారు అధికారులు. ఈ కేసులో కీలక నిందితుడు కెల్విన్ (Kelvin)ను, రానాను కలిపి ఈడీ విచారించింది.
2016 నవంబర్ లో జరిగిన ఎఫ్ క్లబ్ పార్టీపై విచారించింది ఈడీ. ఎఫ్ లాంజ్ పబ్ లో జరిగిన పార్టీ గురించి ఆరా తీశారు. పార్టీ తర్వాత రానా ఖాతాల నుంచి నగదు బదిలీలు జరిగినట్టుగా ఈడీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు రానాకు సుమారు 100 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టినట్టు తెలుస్తోంది. రానా 2015-18 బ్యాంక్ స్టేట్ మెంట్లను ఈడీకి సమర్పించాడు. రెండు బ్యాంకు ఖాతాల వివరాలిచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు హై సెక్యూరిటీతో ఉన్న కెల్విన్ ల్యాప్ టాప్ ను తెరిపించారు అధికారులు.
ఇక రేపు ఈడీ విచారణకు రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, నవదీప్ హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందులని ఈడీ అధికారులు విచారించారు. నవదీప్కు చెందిన ఎఫ్ క్లబ్కు రానా తరచూ వెళ్లినట్టు, ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్టు ఆధారాలు లభించడంతో రానాకు ఈడీ నోటీసులు పంపింది.
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని
Sanjay Dutt: సౌత్లోను బిజీ అవుతున్న సంజయ్ దత్