తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఈ టాలీవుడ్ (Tollywood) బ్యూటీ ఇటీవలే తొలి హిందీ ప్రాజెక్టు మిషన్ మజ్ను షూటింగ్ పూర్తి చేసింది. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప, శర్వానంద్ తో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది కార్తీతో కలిసి తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక..ఈ సారి తమిళ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan)తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ సినిమాలో కనిపించనుందన్న వార్త అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
అయితే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కానీ, తిరస్కరించినట్టు కానీ రష్మిక నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో శివ కార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ సినిమాలో రష్మిక ఫీమేల్ లీడ్ రోల్ దాదాపు ఫైనల్ అయిందని, అధికారిక ప్రకటన ఒకటే పెండింగ్ లో ఉందని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. జాతి రత్నాలు ఫేం అనుదీప్ కేవీ డైరెక్షన్ లో శివకార్తికేయన్ తెలుగు సినిమా చేయబోతున్నాడు.
తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. మరోవైపు రష్మిక మందన్నాకు సంబంధించి కూడా అప్ డేట్ ఇవ్వనున్నారట మేకర్స్. మరి ఈ కన్నడ సోయగం నెక్ట్స్ తెలుగు సినిమా శివకార్తీకేయన్ తోనేనా అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.
Bangarraju | బంగార్రాజు టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Surender Reddy: పవన్ సినిమాకు ముందు మరో సినిమా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి ..!