స్టైలిష్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్గా నిలిచిన సురేందర్ రెడ్డి ‘అతనొక్కడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా, ఆ తర్వాత.. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రవితేజ, రామ్ చరణ్, చిరంజీవి వంటి హీరోలతో సినిమాలు చేసి మంచి సక్సెస్లు సాధించారు. తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఈ ‘ఏజెంట్’ మూవీ రూపొందుతుండగా, చిత్రం మునుపెన్నడూ చూడని విభిన్నమైన కథ, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతుంది. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించనున్నారు. సాక్షి వైద్య ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం కానుంది.
ఇక పవన్ బర్త్ డే సందర్భంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రకటించారు. అయితే ఇప్పటికే పవన్ లిస్ట్ చాలా పెద్దదిగా ఉండడంతో ఆయనతో సినిమా చేసేందుకు చాలా సమయం పడుతుంది. ఈ లోపు మరో రెండు సినిమాలు ప్లాన్ చేసే ఆలోచనలో సురేందర్ రెడ్డి ఉన్నాడట. అందులో ఒకటి యూత్ స్టార్ నితిన్తో ఉండనున్నట్టు తెలుస్తుంది.