Cogress Party Candidates | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను ప్రకటించింది. 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం ఓ ప్రకటన చేశారు. ఇంతకుముందు 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. పది నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసింది. దీంతో ఇప్పటి వరకూ 142 అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
ఇక ఇండియా కూటమి పొత్తులో భాగంగా అరకు లోక్ సభతోపాటు ఎనిమిది అసెంబ్లీ సీట్లను సీపీఎంకు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలోని 25 లోక్ సభా స్థానాలకు ఇప్పటి వరకూ 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఒకటి సీపీఎంకు కేటాయించడంతో మరో నాలుగు లోక్ సభ, 33 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇలా..
శ్రీకాకుళం: పాడి నాగభూషణ రావు స్థానే అంబటి కృష్ణారావు
బొబ్బిలి: మరిపి విద్యాసాగర్
గజపతి నగరం : కురిమినాయుడుకు బదులు దోలా శ్రీనివాస్
నెల్లిమర్ల: ఎస్ రమేశ్ కుమార్
విశాఖ నార్త్ : లక్కరాజు రామారావు
చోడవరం : జగత్ శ్రీనివాస్
యలమంచిలి: టీ నర్సింగ్ రావు
పీ గన్నవరం (ఎస్సీ): కే చిట్టిబాబు
ఆచంట : నెక్కంటి వెంకట సత్యనారాయణ
విజయవాడ ఈస్ట్ : సుంకర పద్మశ్రీ
జగ్గయ్యపేట : కర్నాటి అప్పారావు
తాటికొండ ఎస్సీ: చిలకా విజయ్ కుమార్ స్థానంలో మణిచల సుశీల్ రాజా
రేపల్లె: మోపిదేవి శ్రీనివాసరావు
తెనాలి: ఎస్కే బషీద్
గుంటూరు వెస్ట్ : డాక్టర్ రాజకొండ జాన్ బాబు
చీరాల: ఆమంచి కృష్ణమోహన్
ఒంగోలు: బుట్టి రమేశ్ బాబుకు బదులు తుర్లపాక నాగలక్ష్మి
కనిగిరి: కదిరి భవానీకి బదులు దేవరపల్లి సుబ్బారెడ్డి
కావలి: పొదలకూరి కల్యాణ్
కోవూరు: నెబ్రంబాకు మోహన్ బదులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి
సర్వేపల్లి: పూల చంద్రశేఖర్ బదులు పీవీ శ్రీకాంత్ రెడ్డి
గూడూరు ఎస్సీ: వేమయ్య చిలుకూరి స్థానే డాక్టర్ యూ రామకృష్ణారావు
సూళ్లూరిపేట ఎస్సీ: గడి తిలక్ బాబుకు బదులు చందనమూడి శివ
వెంకటగిరి: పీ శ్రీనివాసులు
కడప: తుమ్మన్ కల్యాల్ ఆస్జల్ అలీ
పులివెందుల: మూలంరెడ్డి ధృవకుమార్ రెడ్డి
జమ్మలమడుగు: బ్రహ్మానందరెడ్డి పాముల
ప్రొద్దుటూరు: షేక్ పూల మహ్మద్ నజీర్
మైదుకూరు: గుండ్లకుంట శ్రీరాములు
ఆళ్లగడ్డ: బారగొడ్ల హుస్సేన్
శ్రీశైలం : అసర్ సయ్యద్ ఇస్మాయిల్
బనగానపల్లె: గూటం పుల్లయ్య
డోన్: గారపాటి మధులెట్టి స్వామి
ఆదోని : గొల్ల రమేశ్
ఆలూరు: నవీన్ కిశోర్ ఆరకట్ల
కల్యాణ దుర్గం: పీ రాంభూపాల్ రెడ్డి
హిందూపురం: వీ నాగరాజు స్థానంలో మహ్మద్ హుస్సేన్ ఇనయతుల్లా.
ధర్మవరం: రంగాన అశ్వర్థ నారాయణ