RR vs MI : ఐపీఎల్ 17వ సీజన్లో జైపూర్ వేదికగా 38వ మ్యాచ్ జరుగుతోంది. టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)తో ముంబై ఇండియన్స్(Mumbai Indians) తలపడుతోంది. వాంఖడేలో రాజస్థాన్ చేతిలో చిత్తైన ముంబై ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ పోరులో రాజస్థాన్ సందీప్ శర్మను తీసుకోగా.. పాండ్యా సేన మూడు మార్పులతో ఆడుతోంది.
ముంబై తుది జట్టు : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయుశ్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.
రాజస్థాన్ తుది జట్టు : యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మైర్, రొవ్మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యజ్వేంద్ర చాహల్.
పదిహేడో సీజన్లో హ్యాట్రిక్ ఓటములతో డస్సి పోయిన ముంబై.. ఆ తర్వాత వరుస విజయాలో చెలరేగింది. అయితే.. మళ్లీ ఓటమి బాట పట్టి ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడింది. మరోవైపు సంజూ సేన టాప్ గేర్లో దూసుకెళ్తోంది. ఏకంగా ఆరు విజయాలతో రాజస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.