Sachin Pilot : పదేండ్ల ఎన్డీయే ప్రభుత్వంలో రికార్డు స్ధాయిలో నిరుద్యోగం ఎందుకు వెంటాడుతోందనేది కాషాయ పాలకులు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ నిలదీశారు. లోక్సభ ఎన్నికలు దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని ఇవి అభివృద్ధి, పురోగతి, సౌభ్రాతృత్వం అజెండాగా జరగాలని పైలట్ పేర్కొన్నారు. బీజేపీ అగ్ర నేతల ప్రకటనలు చూస్తుంటే బీజేపీ తొలి దశ పోలింగ్లో వెనకబడిందనేది స్పష్టంగా అర్ధమవుతోందని అన్నారు.
తమకు అందిన సమాచారం ప్రకారం ఎన్డీయే కంటే ఇండియా కూటమి ముందంజలో ఉందని తెలుస్తోందని చెప్పారు. కేరళలో 20 స్ధానాలకు గతంలో 19 స్ధానాల్లో తాము గెలుపొందామని, ఈసారి ఇండియా కూటమి 20 స్ధానాలూ క్లీన్స్వీప్ చేస్తుందని చెప్పారు. గతం కంటే అధిక మార్జిన్తో రాహుల్ గాంధీ వయనాద్ నుంచి గెలుపొందుతారని సచిన్ పైలట్ ధీమా వ్యక్తం చేశారు.
జాతీయస్దాయిలో బీజేపీని ఢీకొట్టేది కాంగ్రెస్ పార్టీయేనని ప్రజలకు అర్ధమైందని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తమ స్ధానాల సంఖ్య పెరుగుతుందని, విపక్ష ఇండియా కూటమి జూన్ 4న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సచిన్ పైలట్ ధీమా వ్యక్తం చేశారు. తాము దేశ ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేస్తామని, ఈ దేశం అందరిదనీ అన్నారు. బీజేపీ అగ్రనేతల ప్రకటనలు చూస్తుంటే ఎన్నికల ఫలితాలపై వారికి భయం పట్టుకుందని తెలుస్తోందని చెప్పారు. కేరళలో యూడీఎఫ్ మొత్తం 20 స్ధానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు.
Read More :