గద్వాల: జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ధరూర్ మండలంలోని రిజర్వాయర్ కాలువల ద్వారా కృష్ణా జలాలను పంట పొలాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ఆ నీటిని రిజర్వాయర్లకు పంపింగ్ చేసి అక్కడి నుంచి కాలువలకు విడుదల చేశామని చెప్పారు. రైతులు నీటిని సక్రమంగా వినియోగించుకుని పంటలు పండించాలని కోరారు.