ముంబై: కరోనా సంక్షోభ సమయంలో నిధుల కొరతతో ఇబ్బందుల పాలవుతున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ముందుకు వచ్చింది. భారీగా నిధులు సమకూర్చేందుకు సిద్ధమైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) లో రూ. 99,122 కోట్ల మిగులు నిధులను డివిడెంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ చెల్లించనుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం ఆమోదముద్ర వేసింది.
కరోనావల్ల భారీగా ఆదాయం పడిపోవడంతో ఇబ్బందుల్లో కేంద్ర ప్రభుత్వం చిక్కుకున్న వేళ.. డివిడెండ్ రూపంలో ఆర్బీఐ అందించే నిధులు ఉపయోగపడనున్నాయి. కరెన్సీ ట్రేడింగ్, బాండ్ల ట్రేడింగ్ నుంచి ఆర్బీఐకి భారీగా ఆదాయం లభిస్తుంది.
ఈ ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత తన కార్య కలాపాలకు మినహాయించుకుని మిగతా నిధులను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం అందజేస్తుంది. ఇప్పుడూ అలాగే రూ. 99,122 కోట్లను చెల్లించడానికి నిర్ణయించామని ఆర్బీఐ తెలిపింది.
గతేడాది కూడా కరోనా తొలి దశ సమయంలోనూ కేంద్రానికి ఆర్బీఐ డివిడెంట్ అందజేసింది. అప్పుడు మొత్తం మిగులు ద్రవ్యంలో 44శాతం అంటే రూ. 57వేల కోట్ల నిధులు చెల్లించింది. గత ఏడేండ్లలో ఆర్బీఐ చెల్లించిన అత్యంత తక్కువ డివిడెంట్ ఇదే.
ప్రస్తుతం రెండో దశ కరోనా ప్రభావం ఉద్ధృతంగా ఉంది. వైరన్ను కట్టడి చేయడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్లు, ఆంక్షలు విధించాయి. దీంతో పలు వ్యాపారాలు మూతబడ్డాయి.
గతేడాది కరోనా సంక్షోభ పరిస్థితి నుంచి కాస్త తేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థపై తాజా ఆంక్షలు మరోసారి ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!