హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న సంకల్పంతో స్టడీ మెటీరియల్ను రూపొందించినట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం గన్ఫౌండ్రీలోని తన కార్యాలయంలో స్టడీ మెటీరియల్ను మంత్రి ఆవిష్కరించారు. డిజిటల్ తరగతుల ద్వారా అభ్యసించిన పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థంచేసుకునేలా స్టడీ మెటీరియల్ ఉపయోగపడుతుందని చెప్పారు. తెలుగు, ఉర్దు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో రూపొందించిన మెటీరియల్.. కార్పొరేట్ విద్యాసంస్థల నోట్సుకన్నా అద్భుతం గా ఉన్నదని ప్రశంసించారు. www.scert.telangana.gov.in లో మెటీరియల్ను అందుబాటులో ఉంచామన్నారు. ఆంగ్లమాధ్య మ విద్యార్థులు మాతృభాషలో సాంకేతిక పదాలు నేర్చుకోవడానికి బహుభాషా నిఘంటువును రూపొందించినట్టు మంత్రి తెలిపారు. గణితం, భౌతిక, రసాయన, జీవ, సాంఘికశాస్ర్తాల్లో సాంకేతిక పదాలతో పలు భాషల్లో నిఘంటువును రూపొందించామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్, విద్యాశాఖ కమిషన్ శ్రీదేవసేన, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆరోగ్యకర సమాజంతోనే అభివృద్ధి సాధ్యం
నేటినుంచి టీచర్లకు ఒంటిపూట బడులు
జానారెడ్డి గెలిచి ఏం చేస్తారు?