హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నిర్ధారణ పరీక్షలను రెండింతలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ‘ట్రేసింగ్- ట్రీటింగ్, టీకా’ అనే మూడు పద్ధతుల ద్వారా కరోనా నియంత్రణ చర్యలు వేగంగా చేపట్టాలని సూచించారు. మంగళవారం కొవిడ్ బారిన పడిన ఆయన.. హోంఐసొలేషన్ నుంచే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను వెయ్యికి పెంచాలని ఆదేశించారు. కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ గురించి విస్త్రృతంగా ప్రచారం చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం ఇస్తున్న టీకాల సంఖ్యను రోజుకు 50 వేల నుంచి 1.25 లక్షలకు పెంచాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో పలువురు ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.
సీఎస్ సోమేశ్కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన.. వైద్యుల సలహా మేరకు హోంఐసొలేషన్లో ఉంటున్నట్టు తెలిపారు. సచివాలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ త్రినాథ్కు కూడా కరోనా పాజిటివ్గా తేలింది.
ఇవి కూడా చదవండి..
ఆరోగ్యకర సమాజంతోనే అభివృద్ధి సాధ్యం
పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్
నేటినుంచి టీచర్లకు ఒంటిపూట బడులు
జానారెడ్డి గెలిచి ఏం చేస్తారు?