పరిగి, జూన్ 27: కులవృత్తులకు చేయూత అందించడం ద్వారా ఆయా రంగాలపై ఆధారపడిన వారికి సర్కారు అండగా నిలుస్తున్నది. తద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు సర్కారు చర్యలు ఉపకరిస్తు న్నాయి. రాష్ర్టానికి అవసరమైన మాంసం ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి ఎదగడంలో భాగంగా గొర్రెల పంపిణీ కార్యక్రమానికి టీఆర్ఎస్ సర్కారు శ్రీకారం చుట్టింది. మొదటి విడుతలో అందజేసిన గొర్రెలు పెద్దవై, వాటి పిల్లలతోపాటు మాం సం ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. కాగా త్వరలోనే రెండవ విడుత గొర్రెల పంపిణీ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. వికారాబాద్ జిల్లా పరిధిలో రెండవ విడుతలో 11,073 యూనిట్లు గొర్రెలు పంపిణీ చేయ నున్నారు. ఇందుకు సంబంధించి పశుసంవర్ధక శాఖ అధికారులు కార్యా చరణ రూపొందిస్తున్నారు. జిల్లా పరిధిలో మొత్తం 311 గొర్రెల పెంపకం దారుల సహాయ సహకార సంఘాలు ఉన్నాయి. సొసైటీలలో గల సభ్యులకు మొదటి విడుతలో 10,954 యూనిట్లకు కాంట్రిబ్యూషన్ డబ్బులు చెల్లిం చగా, 10,477 యూనిట్లు గొర్రెలు అందజేశారు. జిల్లాలోని వికారాబాద్ డివిజన్లో 2,408 యూనిట్లు, నవాబుపేట్లో 666 యూనిట్లు, పరిగి డివిజన్లో 3,173 యూనిట్లు, తాండూరు డివిజన్లో 1,921 యూనిట్లు, కొడంగల్ డివిజన్లో 2,309 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేశారు. రూ.130.96కోట్ల విలువ చేసే గొర్రెల పంపిణీ చేపట్టారు. ఒక యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొటేలు ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా 1,547 గొర్రెలు, 101 పొటేళ్లు చనిపోగా, వాటి స్థానంలో మళ్లీ అందజేశారు. ఇకపోతే రెండవ విడుతలో వికారాబాద్ డివిజన్లో 2,658 యూనిట్లు, నవాబుపేట్లో 786 యూనిట్లు, పరిగి డివిజన్లో 3,326 యూనిట్లు, తాండూరు డివి జన్లో 1,928 యూనిట్లు, కొడంగల్ డివిజన్లో 2,375 యూనిట్ల గొర్రె లను అందజేయనున్నారు. ఈ లెక్కన రెండవ విడుతలో 2,21,460 గొర్రె లు, 11,073 పొటేళ్లను గొర్రెల పెంపకందారులకు అందజేస్తారు. వాటితో పాటు ఒక యూనిట్ గొర్రెలకు 402 కిలోల దాణా, రూ.500 విలువ చేసే మందులు అందజేయడంతోపాటు రవాణా చార్జీలు ప్రభుత్వం భరిస్తుంది.
యూనిట్ ధర పెంపు…
మార్కెట్లో అన్నింటి ధరలు పెరగడంతోపాటు గొర్రెలు, పొటేళ్ల ధరలు సైతం పెరిగాయి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం అందజేసే గొర్రెల యూనిట్ల ధరలు పెరగనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. గతంలో యూనిట్ ధర రూ.1.25లక్షలు ఉండగా ఈసారి ధరల పెరుగుదలతోపాటు డీజిల్ ధర పెరగడంతో రవాణా భారం మరింత పడనుంది. అందువల్ల మార్కెట్లో గొర్రెలు, పొటేళ్లు ఎంతకు ధర పలుకుతున్నాయి తదితర అంశాలపై పశు సంవర్ధక శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు డీజిల్ ధరలు పెరగడంతో ఏ ప్రాంతం నుంచి గొర్రెలు కొనుగోలు చేసి తీసుకువస్తే ఎంత ఖర్చవుతుంది తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. అందుకు అను గుణంగా యూనిట్ ధర పెంపకంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చనున్నారు. ప్రభుత్వం ఆమోదముద్ర వేయగానే రెండవ విడుత గొర్రెలు అంద జేసే కార్యక్రమం ప్రారంభించేందుకు వీలుగా అధికారులు రాష్ట్ర స్థాయిలో తరుచుగా అనేక అంశాలపై సమావేశాలు జరుపుతున్నారు. త్వరలోనే యూనిట్ ధర పెంపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. జిల్లాల వారిగా రెండవ విడతలో అందజేసే గొర్రెల యూనిట్లు, లబ్ధిదారుల వివరాల సేకరణ చేపడుతున్నారు.
అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం
వికారాబాద్ జిల్లా పరిధిలో రెండవ విడుతలో 11,073 యూనిట్ల గొర్రెలు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. మొదటి విడతలో 10,477 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేశాం. రెండవ విడుతలో 2.32లక్షల గొర్రెలు, పొటేళ్ల పంపిణీ జరు గనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాలపై సమావేశాలు జరుగుతు న్నాయి.
-డాక్టర్ అనిల్కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి