కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా(Asifabad district) రెబ్బెన మండలం తుంగెడ అటవీ ప్రాంతంలో పోడుదారులు, అటవీ శాఖ అధికారుల(Forest officials) మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అక్రమంగా పోడు వ్యవసాయం(Podu cultivation) చేస్తున్నారనే సమాచారం మేరకు అటవీ అధికారులు తుండెడ గ్రామం చేరుకున్నారు. అటవీశాఖ భూముల్లో పోడు వ్యవసాయం కోసం చెట్లు నరుకుతున్న గ్రామస్తులను అధికారులు అడ్డుకున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం దాడులకు పాల్పడటంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, అక్రమంగా అటవీ భూములను సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.