Nirmala on Crypto’s | పటిష్ఠంగా క్రిప్టో కరెన్సీల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నదని తెలుస్తున్నది. సమర్థవంతంగా టెక్నాలజీ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ నియంత్రణకు ప్రపంచ దేశాలు ఉమ్మడి కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అనునిత్యం అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కట్టడి చేయడానికి నియంత్రణ సంస్థలకు ఒక విధానం అవసరం అని, కానీ ఈ దిశగా ఒక్క ఫార్ములా కూడా లేదని శుక్రవారం ఇనిఫిటీ ఫోరం-2021లో మాట్లాడుతూ అన్నారు.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో టెక్నాలజీ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ నియంత్రణపై ఆలోచిస్తున్నామన్నారు. మదుపర్ల క్రిప్టో కరెన్సీ ఇదే టైంలో అంతర్జాతీయ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
నైతిక విలువలకు అనుగుణంగా డేటాను వినియోగిస్తూ మదుపర్ల క్రిప్టో కరెన్సీ ఎక్కడ ఉంది, టెక్నాలజీ ఆధారిత చెల్లింపులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయన్న సంగతి తెలుసుకోవడానికి మనమంతా టెక్నాలజీ కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
డేటాను ఆదాయ మార్గంగా పరిగణిస్తున్నప్పుడు దాన్ని ఉమ్మడిగా నియంత్రించాలని చెప్పారు. టెక్నాలజీ రంగ ప్రవేశంతో సరిహద్దులు చెరిగిపోయాయని అన్నారు. ఈ నేపథ్యంలో టెక్నాలజీ ఆధారిత చెల్లింపులను సమర్థవంతంగా నియంత్రించడానికి అంతర్జాతీయ కార్యాచరణ ఒక్కటే మార్గం అని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హైదరాబాద్లో బడ్జెట్ ధరలో టేస్టీ దోశ, ఇడ్లీ తినాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం అదే.. పారిస్ కూడా దాని తర్వాతే!
మట్టితో ఇంటిని నిర్మించాడు.. ఆ ఇల్లు స్పెషాలిటీ ఏంటో తెలుసా?
డ్రైవర్లకు పోలీసుల ‘గరమ్ చాయ్’.. ఎందుకంటే?