ముంబై : ఐటీసీ నికర లాభం 30.24 శాతం పెరిగింది. సిగరెట్ ఆదాయం రూ.5,802.67 కోట్ల వరకు పెరిగింది. ఐటీసీ లిమిటెడ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం ఏప్రిల్-జూన్ నెలల్లో 30.24 శాతం పెరిగి రూ.3,343.44 కోట్లకు చేరుకున్నది. కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2,567.07 కోట్లుగా ఉన్నది.
జూన్ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 35.91 శాతం పెరిగి రూ.14,240.76 కోట్లకు చేరుకుందని, ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం గత ఏడాది ఇదే కాలంలో రూ.10,478.46 కోట్లుగా ఉన్నది. కంపెనీ మొత్తం ఖర్చులు రూ.10,220 కోట్లు కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఖర్చులు రూ.7,967.71 కోట్లుగా ఉన్నాయి.
ఐటీసీ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ ఆదాయం 23.68 శాతం పెరిగి రూ.9,534.07 కోట్లకు చేరుకున్నది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .7,709 కోట్లుగా ఉన్నది. సిగరెట్ల ద్వారా వచ్చే ఆదాయం 34 శాతం పెరిగింది. ఈ ఆదాయం రూ.5,802.67 కోట్లకు చేరుకున్నది. కాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ.4,330 కోట్లు. ఐటీసీ ప్రకారం, అనేక రాష్ట్రాల్లో కొవిడ్-19 కారణంగా లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఆర్థిక పరిస్థితి సవాలుగా మారింది. 2020-21 జనవరి-మార్చి త్రైమాసికంలో సిగరెట్ ఆదాయం కరోనా పూర్వ స్థాయికి చేరుకున్నది.
‘నేషన్ ఫస్ట్’ మంత్రంతో ముందుకు : మన్ కీ బాత్లో మోదీ
చరిత్రలో ఈరోజు.. 43 ఏండ్ల క్రితం టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టి
శుభవార్త..! తగ్గనున్న ఐదు మెడికల్ డివైజ్ల ధరలు
ఒలింపిక్స్లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం..!
1991 నాటి ఆర్థిక కష్టాలు రానున్నాయి : మన్మోహన్ సింగ్ హెచ్చరిక
సెప్టెంబర్ నుంచి చిన్నారులకు కరోనా టీకాలు : గులేరియా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..