న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివున్నదన్న ఆందోళనల మధ్య.. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది. కరోనా వైరస్ నివారణకు వినియోగించే ఐదు రకాల వైద్య పరికరాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ప్రకటించారు. పల్స్ ఆక్సిమీటర్, బీపీ మానిటరింగ్ మెషిన్, డిజిటల్ థర్మోమీటర్, నెబ్యులైజర్, గ్లూకోమీటర్ పరికరాలపై వాణిజ్య మార్జిన్ను ప్రభుత్వం పరిమితం చేయడంతో వీటి ధరలు తగ్గనున్నాయి. ఈ ధరలు తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు వచ్చే ఏడాది జనవరి 31 వరకు అమలులో ఉండనున్నాయి.
ఐదు రకాల వైద్య పరికరాల ధర మార్పులు ఈ నెల 20 నుంచి అమల్లోకి వచ్చాయని రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.పంపిణీదారు (పీటీడీ) స్థాయిలకు మార్జిన్ ధర 70 శాతం వరకు ఉన్నది. తాజా చర్య అనంతరం మొత్తం 684 ఉత్పత్తులు ఇటువంటి వైద్య పరికరాల బ్రాండ్ల ధరల తగ్గాయి. కరోనా వైరస్ ఫస్ట్, సెకండ్ వేవ్ సమయాల్లో ఇలాంటి వైద్య పరికరాల కోసం సామాన్యులు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సామాన్యులకు భారీ ఉపశమనం కలిగించనున్నది.
ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, సంబంధ పరికరాల ధరలను నియంత్రించే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ), పంపిణీదారు (పీటీడీ) స్థాయిలో 70 శాతం ధరలను పరిమితం చేసింది. పరిశ్రమల సంఘాలైన ఫిక్కీ, అద్వామెడ్, అమ్చామ్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ‘ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఐదు వైద్య పరికరాలపై ప్రభుత్వం వాణిజ్య మార్జిన్ను పరిమితం చేసిందని, ఫలితంగా వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు.
ఒలింపిక్స్లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం..!
కశ్మీరీలు పాక్లో చేరడంపై రెఫరెండం : పీఓకే ఎన్నికల్లో ఇమ్రాన్ హామీ
1991 నాటి ఆర్థిక కష్టాలు రానున్నాయి : మన్మోహన్ సింగ్ హెచ్చరిక
సెప్టెంబర్ నుంచి చిన్నారులకు కరోనా టీకాలు : గులేరియా
ఐఏఎస్ అధికారి నివాసంలో సీబీఐ తనిఖీలు
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్ ఇది
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..