న్యూఢిల్లీ : ఒలింపిక్ క్రీడల్లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం సృష్టించింది. ఇండియాకు చెందిన టెన్నీస్ ఆటగాడు సుమిత్ నాగల్ అద్భుత ఆటతీరుతో రెండో రౌండ్కు చేరుకుని 25 ఏండ్ల తర్వాత టెన్నీస్లో సింగిల్స్ తొలి రౌండ్ గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు భారత్ తరఫున 1988 లో జీషన్ అలీ, 1996 లో లియాండర్ పేస్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. అట్లాంటా ఒలింపిక్స్లో లియాండర్ పేస్ కాంస్య పతకాన్ని గెలుచుకుని రికార్డు సృష్టించాడు. పేస్ పతకం గెలిచే నాటికి ప్రస్తుతం సంచలనం సృష్టించిన సుమిత్ నాగల్ (23) పుట్టకపోవడం విశేషం.
శనివారం మధ్యాహ్నం జరిగిన పురుషుల టెన్నీస్ సింగిల్స్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన డెనిస్ ఇస్తోమిన్ను 64, 6-7(6), 6-4 స్కోరుతో వరుస సెట్లలో ఓడించి తొలి రౌండ్ విజయవంతంగా ముగించాడు. వీరి మధ్య పోరాటం కేవలం 34 నిమిషాల్లోనే పూర్తయింది. నాగల్ ప్రస్తుతం 144 ర్యాంకులో ఉండగా, ఒకప్పుడు 33 వ ర్యాంకులో ఉండి ప్రస్తుతం 160 కి పడిపోయిన ఇస్తోమిన్ను ఓడించాడు.
2019 లో యూఎస్ ఓపెన్కు క్వాలిఫికేషన్ రౌండ్ ద్వారా నాగల్ తన మొదటి గ్రాండ్స్లామ్ మెయిన్ డ్రా మ్యాచ్ను గొప్ప ఆటగాడు రోజర్ ఫెదరర్తో ప్రారంభించాడు. ఫెదరర్కు పోటీ ఇచ్చిన నాగల్.. మొదటి సెట్ను కైవసం చేసుకుని, చివరి నాలుగు మ్యాచుల్లో ఓడిపోయాడు. కానీ, 20 సార్లు గ్రాండ్స్లామ్ ఛాంపియన్గా నిలిచిన ఫెదరర్ను నాగల్ విశేషంగా ఆకట్టుకున్నాడు. ఏడాది తర్వాత 2013 యూఎస్ ఓపెన్లో డెనిస్ కుడ్లాను ఓడించి యూఎస్ ఓపెన్లో సోమదేవ్ దేవవర్మన్ తర్వాత గ్రాండ్స్లామ్ మెయిన్ డ్రా మ్యాచ్లో గెలిచిన తొలి ఆటగాడిగా నాగల్ నిలిచాడు. రెండవ రౌండ్లో ఛాంపియన్గా నిలిచిన డొమినిక్ థీమ్పై అద్భుత ప్రదర్శన ఇచ్చి నలుగురు గుర్తుంచుకునేలా చేసుకోగలిగాడు.
కశ్మీరీలు పాక్లో చేరడంపై రెఫరెండం : పీఓకే ఎన్నికల్లో ఇమ్రాన్ హామీ
1991 నాటి ఆర్థిక కష్టాలు రానున్నాయి : మన్మోహన్ సింగ్ హెచ్చరిక
సెప్టెంబర్ నుంచి చిన్నారులకు కరోనా టీకాలు : గులేరియా
ఐఏఎస్ అధికారి నివాసంలో సీబీఐ తనిఖీలు
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్ ఇది
పైకి పెరిగిన భూమి.. హర్యానాలో వింత సంఘటన!.. వీడియో వైరల్..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..