కోదాడ, జూలై 07 : మాదిగ దండోరా మాదిగల ఉపకులాల ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని ఎమ్మార్పీఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతాబాబు మాదిగ అన్నారు. దండోరా 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హక్కుల కోసం సముచిత పోరాటం చేసిందన్నారు.. ఉద్యమాలు, అమరుల త్యాగ ఫలితంగా ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బచ్చలకూరి నాగరాజు, స్వామి నాగేశ్వరరావు, బాబురావు, చిన్ని, విజయ్, శ్రీను, చంటి, వినయ్, సతీష్, రాజేష్, మధు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి రాజు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. తమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము మాదిగ, వీహెచ్పీఎస్ జాతీయ నాయకుడు కర్ల విజయరావు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కర్ల కాంతారావు, గంధం పాండు, గుండెపంగు రమేష్, కాంపాటి పుల్లయ్య, కుడుముల లక్ష్మీనారాయణ, ఏపూరి సత్యరాజు, పంది లక్ష్మయ్య, అన్నెపాక మహేష్, కర్ల రాజేష్ తల్లి కర్ల లలితమ్మ, ఏపూరి ఈశ్వరమ్మ ఏపూరి సైదమ్మ, రాయల మంగమ్మ పాల్గొన్నారు.

‘మాదిగల ఆత్మగౌరవాన్ని పెంచిన దండోరా’