ఈరోజుల్లో ఎప్పుడు ఏ రోగం వస్తుందో చెప్పలేని పరిస్థితి ! ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి జబ్బు పడి ప్రాణాల మీదకు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు !! ఒకవేళ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా ఆస్పత్రి ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు ఇంకా అధ్వాన్నంగా తయారయ్యాయి. అందుకే ఆరోగ్య బీమా తీసుకోవడం చాలా మంచిది. ఎమర్జెన్సీ సమయంలో క్యాష్లెస్ వైద్య సేవలు పొందేందుకు ఈ పాలసీలు వెసులుబాటు కల్పిస్తుంటాయి. అయితే నెట్వర్క్ ఆస్పత్రుల్లో మాత్రమే నగదు రహిత సేవలను పొందవచ్చు. అలా కాకుండా వేరే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే.. డబ్బుల రీఫండ్ కోసం క్లైయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు క్లైయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఇలా ఎందుకు క్లైయిమ్ తిరస్కరిస్తారు? అలాంటి సమయంలో ఏం చేయాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఆస్పత్రి ఖర్చులో 90 శాతాన్ని చెల్లిస్తున్నాయి. ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఖర్చుల్లో 50 శాతాన్నిపే చేస్తున్నాయి. అయితే వీటిలో ఏవి తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజి ఇస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే ఏ ఇన్సూరెన్స్ కంపెనీల నియమ నిబంధనలు బాగున్నాయో కూడా విశ్లేషించుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు కింది విషయాలను జాగ్రత్తగా గమనించడం చాలా అవసరం.
సాధారణంగా సాంకేతిక కారణాల వల్లనే హెల్త్ ఇన్సూరెన్స్ క్లైయిమ్ రిజెక్ట్ అవుతుంది.
ఆస్పత్రి బిల్లుల విషయంలో తేడాలు ఉన్నట్లు అనిపిస్తే.. అంటే ట్రీట్మెంట్కు సంబంధించిన వివరాలను, మెడిసిన్స్ బిల్లులతో పోల్చి చూసినప్పుడు వ్యత్యాసం ఉన్నట్లు తేలితే క్లైయిమ్ రిజెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు అదనపు వివరాల కోసం కూడా క్లైయిమ్ అప్లికేషన్ను పెండింగ్లో పెట్టవచ్చు. ఒక్కోసారి కొన్ని చికిత్సల కోసం ఆస్పత్రిలో చేరడం అనవసరమని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు భావిస్తుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే డాక్టర్ను ముందుగానే సంప్రదించి, పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఇన్సూరెన్స్ కంపెనీల ఫిర్యాదు విభాగానికి కూడా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. నెట్వర్క్ ఆస్పత్రుల్లోని వైద్యులు.. హాస్పిటల్లో చేరాలని సూచించిన సందర్భాల్లో దాదాపుగా క్లైయిమ్ను తిరస్కరించవు.
అన్ని బిల్లులు, వివరాలు సరిగ్గానే అందజేసినా.. మీ క్లైయిమ్ను తిరస్కరించినట్లు అనిపిస్తే ఇన్సూరెన్స్ కంపెనీల ఫిర్యాదు విభాగంలో రిపోర్ట్ చేయాలి. వారి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోతే గ్రీవియెన్స్ రీడ్రెస్సల్ ఆఫీసర్ ( జీఆర్వో )కి లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదు చేయవచ్చు. పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు తిరస్కరణకు ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పిన కారణాలు, ఇతరత్రా పత్రాలనూ ఈ కంప్లయింట్ ఫామ్తో జత చేయాలి. సంబంధిత జీఆర్వో వివరాలు బీమా పాలసీ పత్రాల్లోనే ఉంటాయి. ఈ ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులెటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ( irdai ) ప్రత్యేక ఏర్పాటు కూడా చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీ లేదా జీఆర్వో నుంచి కూడా ఆశించిన ఫలితం రాకపోతే పాలసీదారులు తదుపరి చర్యలు తీసుకోవచ్చు.
ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా జీఆర్వో సూచించిన పరిష్కారం సంతృప్తిగా లేకపోతే అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. ఇది పాలసీదారుడికి, ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య వారధిలా ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ను పరిశీలించి ఈ అంబుడ్స్మన్ తీర్పు చెబుతుంది. ఈ తీర్పునే అవార్డు అని కూడా పేర్కొంటారు. ఈ అవార్డు వెలువడిన తర్వాత 30 రోజుల్లోగా బీమా సంస్థలు దాన్ని పాటించాల్సి ఉంటుంది. పాలసీదారుడు దీన్ని అంగీకరించకపోతే కోర్టును ఆశ్రయించవచ్చు.
బీమా పాలసీదారుల పాలసీ ప్రకారం క్యాష్లెస్ ట్రీట్మెంట్కు అర్హులైనప్పటికీ కొవిడ్ -19 బాధితులకు పలు ఆస్పత్రులు నగదు రహిత సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఆర్డీఏఐ అనేకసార్లు స్పష్టత ఇచ్చింది. కరోనా సోకిన వారికి క్వారంటైన్ సమయంలో అయ్యే ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీలు.. ముందు పేర్కొన్న నిబంధనల మేరకే చెల్లించాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నప్పుడు.. క్లైయిమ్ తిరస్కరించవద్దని సూచించింది. అయినప్పటికీ దీన్ని అమలు చేయకపోతే సంబంధిత ఆస్పత్రులపై, బీమా కంపెనీలపై ఫిర్యాదు చేయవచ్చని ఐఆర్డీఏఐ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
క్రెడిట్ కార్డుకు అప్లయి చేస్తే రిజెక్ట్ చేశారని.. 1.2 బిలియన్ డాలర్ల కంపెనీని స్థాపించాడు
PNB Offers : పీఎన్బీ ఫెస్టీవ్ ఆఫర్స్.. రుణాలపై అన్ని ఛార్జీల మినహాయింపు
Ola IPO in 2022 | వచ్చే ఏడాదిలోనే మార్కెట్లోకి ఓలా ఐపీవో.. విదేశాల్లోనూ..!
కార్ల తయారీదారులకు అలర్ట్.. 6 నెలల్లో బయో ఇంజిన్లు తప్పనిసరి!