మహబూబ్నగర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నా లుగు నర్సింగ్ కళాశాలలు మంజూరు చేస్తూ ప్రభు త్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 న ర్సింగ్ కళాశాలలు మంజూరు కాగా.. అందులో నా లుగు ఉమ్మడి జిల్లాకు కేటాయించారు. జోగుళాంబ గద్వాల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు నర్సింగ్ కళాశాలలను మంజూరు చేయడమే కాకుండా.. ఒక్కో కళాశాలకు 48 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఏడుగురు ప్రొఫెసర్లు, 12 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 20 మంది లెక్చరర్లు, 8 మంది బోధనేతర సిబ్బందిని నియమించనున్నారు.
ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండగా.. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు నూతనంగా మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి. తా జాగా నర్సింగ్ కళాశాలలు సైతం మంజూరు కావడంతో ఉమ్మడి జిల్లా వాసులు హర్షాతిరేకాలు వ్య క్తం చేస్తున్నారు. నర్సింగ్ చదువు కోసం దూరప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకుండా స్థానికంగానే చదువుకునేందుకు అవకాశం లభిస్తోందని విద్యార్థులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నర్సింగ్ విద్యార్థులకు మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. నర్సింగ్ విద్య చేరువ చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు జిల్లా వాసులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
జోగుళాంబ గద్వాల జిల్లాకు న ర్సింగ్ కాలేజీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ప్రజల తరఫున కృతజ్ఞతలు. వెనుకబడిన జిల్లాకు నర్సింగ్ కళాశాల ఇవ్వడంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకుల పోస్టులు సైతం భర్తీ అవుతాయి. నడిగడ్డకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి వైద్య అవసరాలు తీరుస్తున్నందుకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ సహకారంతో భవిష్యత్లో వైద్యపరంగా మరింత ఉన్నతమైన స్థానానికి తీసుకుపోతాం.