ఊట్కూర్, జూలై 13: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో 268.8 మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఇదివరకే సాగైన పత్తి, కంది, ఆముదం పంటలు ప్రాణం పోసుకున్నాయి. కోస్గి మండలంలో అత్యధికంగా 41.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. నారాయణపేటలో 39.0 మి.మీ., మద్దూర్లో 30.2 మి.మీ., దామరగిద్ద 28.0మి.మీ., మక్తల్ 27.0మి. మీ., మరికల్ 21. 5మి.మీ., మాగనూరు 20.6మి.మీ., ఊట్కూర్ 20. 4మి.మీ., ధన్వాడ 20. 2మి.మీ., నర్వ 12.6 మి.మీ., కృష్ణ 7.6మి.మీ. వర్షపాతం నమోదైంది.