GMR to Expand Hyd Airport | వచ్చే మూడేండ్లలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు దాని నిర్వాహక సంస్థ జీఎంఆర్ గ్రూప్ రూ.6,300 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. 2024 నాటికి 3.4 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా హైదరాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిరోడ్రోమ్ సామర్థ్యాన్నిపెంచాలని జీఎంఆర్ గ్రూప్ తీర్మానించింది. బాండ్ల జారీ ద్వారా ఈ నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ డిప్యూటీ సీఈవో అంటోనె క్రొంబెజ్ తెలిపారు.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ, అంతర్జాతీయ టర్మినల్స్నూ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇండో ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఐఎఫ్సీసీఐ) సదస్సు సందర్భంగా క్రొంబెజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గత జనవరిలోనే అంతర్జాతీయ మార్కెట్ నుంచి సుమారు రూ.2,190 కోట్ల నిధులను సేకరించనున్నట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ జీహెచ్ఐఏఎల్ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Air India | ఎయిరిండియా అప్పులు రూ.60వేల కోట్ల పైచిలుకే!
Air India to TATA | ఏడాదిపాటు ఎయిరిండియా ఉద్యోగులకు నో ఉద్వాసన
వెల్కమ్ బ్యాక్, ఎయిర్ ఇండియా.. రతన్ టాటా ట్వీట్
Air India to TATA’s | టాటా చేతికే మహారాజా..