న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-20లో నిలిచారు. ఫోర్బ్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచంలోని 20 మంది టాప్-20 కుబేరుల్లో గౌతమ్ అదానీ ఉన్నారు. అతి తక్కువ కాలంలోనే ఆయన తన సంపదను భారీగా పెంచుకుని ఈ ఘనత సాధించారు. తాజా వివరాల ప్రకారం. ఈ ఏడాది మార్చి చివరి నాటికి గౌతమ్ అదానీ నికర సంపద 61.5 బిలియన్ డాలర్లని, ఆయనకు సంబంధించిన మొత్తం ఆరు కంపెనీల సంపద 80 బిలియన్ డాలర్లని ఫోర్బ్స్ తెలిపింది.
కాగా, 2021లో అతి ఎక్కువ లాభాలు ఆర్జించిన వ్యక్తుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు అదానీ. ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బజోస్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ల కంటే కూడా ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించిన వ్యక్తిగా అదానీ రికార్డు సృష్టించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
పార్కులో చిరుతదాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు మమ్ముట్టి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్