న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడిగా అవతరించిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతం ఆదానీ దాటేస్తారా? అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బ్లూం బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ నెల 23 నాటికి గౌతం ఆదానీ సంపద 69 బిలియన్ల డాలర్లు.. అంటే మన కరెన్సీలో అక్షరాల రూ.5.03 లక్షల కోట్లు.
2021లో 142 రోజుల్లో గౌతం ఆదానీ సంపదలో రూ.2.56 లక్షల కోట్లు (35.2 బిలియన్ల డాలర్లు) జత కలిసింది. అంటే ఈ ఏడాది ప్రతి గంటకూ రూ.75 కోట్ల మేరకు ఆయన సంపద పెరుగుతూ వచ్చింది.
ఇటీవల బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆసియా కుబేరుల్లో ముకేశ్ అంబానీ తర్వాత స్థానం గౌతం ఆదానీదే. ఇంతకుముందు రెండో స్థానంలో ఉన్న చైనా బాటిల్డ్ వాటర్ టైకూన్ జోంగ్షాన్షాన్ను దాటేశారు ఆదానీ.
సంపద రూపేణా పరిశీలిస్తే ఫ్రాన్స్ బిలియనీర్ బెర్నార్డ్ అర్నాట్ ఈ ఏడాది వ్యక్తిగతంగా సంపాదించిన సంపద 47.9 బిలియన్ల డాలర్లు. దీని ప్రకారం బెర్నార్డ్ అర్నాట్ తర్వాత వ్యక్తిగత సంపద పెంచుకున్న బిలియనీర్ మన గౌతం ఆదానీ.
అంతే కాదు దేశంలోని 19 మంది ఇతర భారతీయ కుబేరుల సంపద 24.5 బిలియన్ల డాలర్ల కంటే గౌతం ఆదానీ వ్యక్తిగత సంపదే ఎక్కువ.
ఆదానీ గ్రూప్ సంస్థలు ఆదానీ గ్రీన్, ఆదానీ ఎంటర్ప్రైజెస్, ఆదానీ గ్యాస్, ఆదానీ ట్రాన్స్మిషన్ తదితర సంస్థల షేర్లు భారీగా దూసుకెళ్లాయి. ఒకవైపు కరోనా మహమ్మారి అందరినీ వణికిస్తున్నా.. ఆదానీ గ్రూప్ షేర్లు ధగధగలాడాయి.
ఏడాది కాలంలో ఆదానీ టోటల్ గ్యాస్ 1145 శాతం గ్రోత్ సాధించింది. ఆదానీ ఎంటర్ ప్రైజెస్ 827 శాతం, ఆదానీ ట్రాన్స్మిషన్ 617 శాతం అభివ్రుద్ధి చెందాయి. ఆదానీ గ్రీన్ ఎనర్జీ, ఆదానీ పవర్ 433, 189 శాతం పెరిగాయి. ఇక ఆదానీ పవర్ 142 శాతం అడ్వాన్స్ అయ్యింది.
రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా ‘యాస్’
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
కరోనాపై మాటల్లోనే భయం.. చేతల్లో లేదు
తృణమూల్ పద్మవ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
చోక్సీ కొత్త ఎత్తు.. అంటిగ్వా నుంచి క్యూబాకు మకాం మార్పు!
టాటా స్టీల్ మహా ఔదార్యం.. కంపెనీపై కురుస్తున్న ప్రశంసల జల్లు
కరోనా నుండి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్