ఆసిఫాబాద్ టౌన్/నస్పూర్, ఆగస్టు 14 : ఆసిఫాబాద్ జిల్లా కేం ద్రంలోని పరేడ్ గ్రౌండ్తో పాటు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ కలెక్టరేట్లో శనివారం నిర్వహించ నున్న పంద్రాగస్టు వేడుకలకు స ర్వం సిద్ధం చేశారు. ఆసిఫాబాద్ లో తెలంగాణ శాసన మండలి డి ప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, న స్పూర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు.
ఆయాచోట్ల స్టాళ్లు సందర్శించి అధికారులకు ప్రశంసా పత్రాలు అందించనున్నారు. స్మార్ట్రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆసిఫాబాద్లో ఎస్పీ నితికాపంత్ ఏర్పాట్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఆర్ఐ అడ్మిన్ వామనమూర్తి ఉన్నారు.