దుమ్ముగూడెం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటిప్రవాహం 15 అడుగులకు చేరింది. చర్ల ,తాలిపేరు వద్ద గేట్లు ఎత్తివేయడంతో దిగువకు వరదనీరు భారీగా చేరుతుండటంతో గోదావరి నీటిప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. సాయంత్రానికి 20 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.