పర్ణశాల: పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో వైష్ణవ ఆచారం ప్రకారం అర్చకులు బుధవారం ఘనంగా ఉట్లోత్సవాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయంలో ఉత్సవమూర్తులు, మూలవిరాట్లకు నూతన వస్త్రాలు అలంకరించి ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయంగా నిర్వహించిన ఉట్లోత్సవంలో యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని తిరువీధిసేవ నిర్వహించి పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భార్గవచార్యులు, నర్సింహాచార్యులు, రాఘవాచార్యులు, ఆలయ ఇన్చార్జ్ రమేష్బాబు, సిబ్బంది రాము, శివ, భక్తులు, యువకులు పాల్గొన్నారు.