దమ్మపేట : టీఆర్ఎస్ జెండా పండుగ వాడవాడలా పండుగ లా కొనసాగింది. గురువారం మండలంలోని ప్రతి గ్రామంలో గులాబీ జెండా రెపరెపలాడింది. నాగుపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు గులాబి జెండాను ఎగరవేసారు. ముష్టిబండలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి, తరువాత పార్టీ జెండాను ఎగురవేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ రూపుదిద్దుకోటుందని, భవిష్యత్లో మరింత అభివృద్ధి టిఆర్ఎస్ తోనేసాధ్యమని నాయకులు అన్నారు.