దుమ్ముగూడెం: చిరుధాన్యాలు, పోషక విలువలతో కూడిన వంటకాలకు సంబంధించి అంగన్వాడీలకు మండల పరిధిలోని నర్సాపురం రైతువేదికలో శుక్రవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణలో సీడీపీవో నవ్యశ్రీ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదల, బరువు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మాణిక్యం, అశ్వాపురం ఐకేపీ ఆర్పీలు సుహాసిని, రాణి, నర్సాపురం సెక్టార్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.