భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో అక్టోబర్ 6 నుంచి అక్టోబర్15 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. 6న అమ్మవారికి ఆదిలక్ష్మి అవతారం, 7న సంతానలక్ష్మి అవతారం, 8న గజలక్ష్మి అవతారం, 9న ధనలక్ష్మి అవతారం, 10న ధాన్యలక్ష్మి అవతారం, 11న విజయలక్ష్మి అవతారం, 12ఐశ్వర్య లక్ష్మి అవతారం, 13న వీరలక్ష్మి, 14న మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతి రోజు లక్ష్మితాయారమ్మవారి సన్నిధిలో ఉదయం అభిషేకం, సామూహిక కుంకుమార్చన, విశేష దర్భార్ సేవ, నివేదన, మహా మంత్ర పుష్పం, ప్రసాద గోష్టి జరుపుతారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతి రోజూ శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలను చిత్రకూట మండపంలో నిర్వహించనున్నారు.
15 సాయంత్రం 4గంటలకు దసరా మండపంలో శమీపూజ శ్రీరామ లీలా మహోత్సవం జరుపుతారు. అదేరోజు ఉదయం 11.30గంటలకు శ్రీరామాయణ పారాయణ సమాప్తి సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. .