భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం సందర్భంగా స్వామివారి ఉత్సవపెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం జరిపారు. అలాగే శ్రీరామచంద్రునికి ఆరాధ్య దైవమైన రంగనాయకుల గుట్టపై వేంచేసి ఉన్న శ్రీరంగనాథ స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన,సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు జరిపారు. అనంతరం శ్రీసీతా, రామ, లక్ష్మణ ఉత్సవమూర్తులను ప్రాకార మండపంలో విశ్వక్సేన ఆరాధన, ఫుణ్యఃవచనం చేశారు.