అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని అఖిలపక్షం నాయకులు కోరారు. దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అటవీ హక్కుల చట్టం, పోడు సమస్య పరిష్కారం కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం సడక్ బంద్లో భాగంగా రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం, సీసీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడా వెంకటరెడ్డి, సీపీఐ ఎమ్ఎల్-న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు, టీడీపీ రాష్ట్ర అద్యక్షులు బక్కిన నరసింహులు, కాంగ్రెస్ జిల్లా నాయకులు కోటేశ్వరరావులు పాల్గొన్నారు.