చుంచుపల్లి :మండలంలోని విద్యానగర్ పంచాయతీ రాంనగర్లో కురిసిన భారీ వర్షం కారణంగా ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి డబుల్బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు, జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, ఎంపీపీ బాదావత్ శాంతి, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, కో-ఆప్షన్ మెంబర్ ఆరీఫ్ఖాన్, డైరెక్టర్ దుంపల ఓంప్రకాష్, టీఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, బాగం మహేశ్వరరావు, కాసాని శ్రీనివాసరెడ్డి, పెయింటర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.