చండ్రుగొండ: జిల్లాలో 481 పంచాయతీల్లో 80లక్షల మొక్కలను హరితహారం కార్యక్రమంలో పెంచుతున్నట్లు డీఆర్డీఏ పీడీ మధుసూధనరాజు అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లోని నర్సరీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాలకు చెందిన ఎన్ఆర్ఈజిఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్సులతో జిల్లా పంచాయతీ అధికారి ఎల్ రమాకాంత్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
నర్సరీల్లో పనులు, పంచాయతీల్లో ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెరుగుదలపై గ్రామపంచాయితీ సెక్రటరీలు, ఉపాధిహామీ పథకం సిబ్బంది అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి సంజీవరావు, ఎంపిడిఓలు అన్నపూర్ణ, రేవతి, ఎంపిఓ తోట తులసీరాం, ఏపిఓలు ప్రమీల, శ్రీనివాస్, గ్రామపంచాయితీ సెక్రటరీలు, ఉపాధిహామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.