భద్రాద్రి కొత్తగూడెం : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు భద్రాచలంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. రేపు ఉదయం 10 గంటల వరకే భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
స్వామివారి నిత్య కైంకర్యాలు అంతరంగికంగా యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో రేపటి నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదాద్రిలోనూ భక్తుల దర్శనాలను నిలిపివేస్తూ ఆలయవర్గాలు నిర్ణయం తీసుకున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.