అశ్వారావుపేట :నూటొక్క ప్రసాదాలతో విఘేశ్వరునికి నైవేద్యంసమర్పించారు. అశ్వారావుపేటలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగాణంలో ఏర్పాటు చేసిన విఘ్ననాయకునికి మంగళవారం రాత్రి101ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించడం విశేషం. ఈ సందర్భంగా భక్తులు గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.