తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం దిశగా పయణిస్తున్నది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 69,724 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. వైసీపీకి 1,57,951 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 88,677 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 15574 ఓట్లు పోలయ్యాయి.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 2500 ఓట్ల లీడ్లో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మొదటి రౌండ్లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో 1907 ఆధిక్యంలో ఉంది.
కౌంటింగ్ సందర్భంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో 14 రౌండ్లు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో తిరుపతి లోక్సభకు ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరిగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..