(Youth Suicide) గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం చోటుచేసుకున్నది. ఓ మైనర్ను వివాహం చేసుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు, బంధువుల దాడి, వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. తాను పెండ్లి చేసుకున్న బాలికను ఆమె తల్లిదండ్రులు తీసుకొని పోవడం వల్లనే మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని పినపాడుకు చెందిన అడపాక శ్రీరామ్ ఆటో డ్రైవర్. వాటర్ ప్లాంట్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. గతేడాది మారీసుపేటలోని ఎన్సీఆర్ఎన్ఎం హైస్కూల్కు వాటర్ క్యాన్లు వేయడానికి వెళ్లిన సమయంలో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు.
అయితే, మూడు రోజుల క్రితం విజయవాడ దుర్గ గుడిలో బాలికను పెండ్లి చేసుకున్నాడు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లడంతో విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. మూడేండ్ల తర్వాత పెండ్ల చేస్తామని మాటిచ్చి బాలికను ఆమె ఇంటివారు తీసుకెళ్లారు. తాను ప్రేమించి పెండ్లి చేసుకున్న అమ్మాయిని ఆమె ఇంటివారు తీసుకెళ్లడాన్ని భరించలేని శ్రీరామ్.. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబీకులు తెనాలి ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలిక కుటుంబసభ్యులు, బంధువులు వేధింపులకు గురిచేయడంతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నది. ఆమె ఫిర్యాదు మేరకు త్రీటౌన్ ఎస్ఐ ఎం విజయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..