అమరావతి : వైసీపీ నేత పరసా కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడ నగరంలో నడిరోడ్డుపై వెంకటరత్నం చౌదరి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి చేసినప్పటి నుంచి కృష్ణ పరారీలో ఉన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీపీ ఫుటేజీ ఆధారంగా బుధవారం రాత్రి కృష్ణ విజయవాడ బస్స్టేషన్ నుంచి హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కృష్ణ దాడిలో గయాపడిన వెంకటరత్నం కోలుకుంటున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
విజయవాడలో నడిరోడ్డుపై జీప్లతో ఢీకొట్టుకున్న యువకులు.. భయంతో పరుగులు తీసిన జనం