అమరావతి : విజయవాడలో ఇద్దరు యువకులు జీపులతో బీభత్సం సృష్టించారు. సినిమా క్లైమాక్స్ను తలిపంచేలా యువకులు నడిరోడ్డుపై జీపులతో ఢీకొట్టి దాడికి పాల్పడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన విజయవాడలోని హైటెన్షన్లో రోడ్డులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..లింగమనేని రోహిత్, బొల్లా చిన్ననాటి స్నేహితులు. అయితే ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుకుంటున్నారనే అనుమానం వారిలి మొదలైంది. ఇదే విషయం తేల్చుకుందాం రా అంటూ పరస్పరం సెల్ఫోన్స్లో సవాళ్లు విసురుకున్నారు.
వచ్చీ రావడంతోనే ఒకరినొకరు జీపులతో ఢీకొట్టుకున్నారు. జీపు దిగి దాడులకు పాల్పడ్డారు. రోహిత్ కారుపై ఓంతో పాటు మరో ఇద్దరు ఐరన్ రాడ్లతో దాడికి పాల్పడ్డారు. రోహిత్ కారు పంక్చర్ కావడంతో అక్కడ నుంచి పారిపోయాడు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఓంతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రోహిత్ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.