యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, చిన్న మండెం జడ్పీటీసీ మోడెం జయమ్మ.. కిలో బంగారం విరాళంగా ప్రకటించారు. కేసీఆర్ పిలుపు మేరకు తాను.. తన కుటుంబ సభ్యులందరం కలిసి ఒక కిలో బంగారాన్ని దేవాలయానికి విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన చెక్కును యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిదిలో అందజేస్తానని తెలిపారు. యాదాద్రి ఆలయ పునఃనిర్మాణానికి సంబంధించిన ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Yadadri | స్వర్ణ తాపడం కోసం ఎవరెవరు ఎంత విరాళం ఇస్తున్నారంటే..
యాదాద్రిలో జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీ : సీఎం కేసీఆర్
యాదాద్రి పునః ప్రారంభానికి మహూర్తం ఖరారు..
Yadadri | యాదాద్రిలో సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ